తెలంగాణ సారస్వత పరిషత్తు రచయితగా డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్

డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ గారు నిర్మల్ జిల్లా సమగ్ర స్వరూపం అనే గ్రంధం లో నిర్మల్ ప్రజల భాష నిర్మాణ సౌందర్యం మరియు కంసాలుల అపూర్వ సృష్టి నిర్మల్ కళ అనే వ్యాసాలను అందించారు. సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య, అడిషనల్ నిర్మల్ కలెక్టర్ పైజాన్ అహ్మద్ చేతుల మీదుగా రచయిత సన్మానం అందుకున్నారు. తుమ్మల దేవరావు, యువకవి కామిండ్ల సకేష్, లింగన్న, అశోక్, బొండిది పురుషోత్తం, టి నర్సయ్య తదితరులు జిల్లా కవులు పాల్గొన్నారు.