ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే ప్రవేశం పొందాలి కరపత్రాలు అందిస్తున్న డిగ్రీ అధ్యాపకులు

మామడ : అన్ని సౌకర్యాలు కల్గిన ప్రభుత్వ
డిగ్రీ కళాశాలలోనే విద్యార్థులు ప్రవేశం పొం దాలని నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జే భీమ్ రావు అన్నారు. మామడ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో పరీక్షలు రాసి బయ టకు వచ్చిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం వి ద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వసతు లు, సౌకర్యాలు, విద్యావిధానం తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేశారు. అధ్యాపకులు ఏ త్రిపాట్ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.