మెరుగు రామయ్య సంకీర్తనల్లో సామాజిక చైతన్యం (పరిశోధనా వ్యాసం)

ISBN NO 9789357865029

మెరుగు రామయ్య సంకీర్తనల్లో సామాజిక చైతన్యం
*10 నవంబర్ 2024, ISBN NO 9789357865029

మానవుడు నాగరికుడై సమాజంలో తాత్విక చైతన్యాన్ని సంపూర్ణంగా పొందగలుగుతున్నాడు మనిషి మానవతకు ప్రతిరూపంగా మారి ఈ సమాజాభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు అంతేకాకుండా తోటి వారిని సమస్త జనులుగా భావించుకొని తన అనుభవంలోని జ్ఞాన సంపదను విశ్వచైతన్యంగా మార్చి విశ్వవ్యాప్తం చేస్తున్నాడు తన భావజాలాన్ని సంకీర్తనలుగా సమాజానికి అందించిన వారిలో మెరుగు రామయ్య ముందున్నాడు.

అడవులకే కాదు అమాయకత్వానికి ప్రతీక అదిలాబాద్ ప్రాంతం ఇలాంటి జిల్లాలో మెరుగు రామయ్య సవర్గం గ్రామంలో అగస్టు 8వ తేదీ 1953వ సంవత్సరంలో జన్మించారు తల్లిదండ్రులు భోజమ్మ భీమన్న చిన్నతనం నుండే పాటలంటే అతనికి ఇష్టం అందువల్ల సంకీర్తనలు పాడడం దినచర్యగా మార్చుకున్నారు తనకు గురువైన పరమేశ్వరయ్య పై తొలి సంకీర్తనను రచించారు.

సాహితీ ప్రపంచానికి మెరుగు రామయ్య గొప్పతనం తెలియాలని మెరుగు రామయ్య సంకీర్తనల్లో సామాజిక చైతన్య అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది నోరు మంచిదైతే ఊరు మంచిదని సమీకరించి అనుసరించి మాట యొక్క గొప్పతనం తెలిపే సంకీర్తన ఇది

“వినవోయి నాది మాట వినుకొని నడుము జ్ఞానము ముఠా విను అది ప్రగతికి బాట మనసై పుట్టిన వెందులకు దేవుని మర్మం పెరుగుటకు దేవుని ఎరుగక కుండకు పశుపక్షాదుల వలె జీవించకు మనుషులకు ఉండును నాలుగు ధర్మములు అర్థ కామ మోక్షములు పక్షులకు ఉండవు ధర్మ మోక్షములు అర్థంలో పశుపక్షులు విరవోయి విజ్ఞానం లేని జ్ఞానం జన్మలకంటే పశుపక్షాదులే మేలని వింటే దుర్గుణములన్నీ మరి మాధవరూపుడే మనీ అంటే విచారము లేని జన్మము కన్నా ఏ జన్మమెత్తినా పర్వాలేదు రన్న పరమేశ్వరయ్య గురువు శరణము గున్న భీమన్న శిష్యుని పలుకినరన్న.”

మాట వలన మనిషి జ్ఞానం వస్తుందని మానవజన్మను ఎత్తినందుకు జంతువుల వలె సమాజంలో బ్రతకకుండా మనిషిగా జీవించాలని ఉద్బోధ ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది.

మానవుడు సంచార జీవనంలో నుండి స్థిర జీవితం కోసం కుటుంబాన్ని ఏర్పరచుకొని తన బాధ్యతలను నెరవేర్చడమే జీవిత లక్ష్యం అని తెలుస్తుంది.

గృహస్థ ధర్మం అనే సంకీర్తనలు పాలు నీళ్ల వల్లే కలిసి సంసారం ప్రేమ తత్వమే గృహస్థమని కుటుంబంతో మనం ప్రేమగా ఉండాలి అందరితో ఆనందంగా జీవించడం అత్యవసరం అంతేకాకుండా కుటుంబం మొత్తం ఆకలి తీర్చుకోవడం కోసం అవసరాలు తీరడం కోసం సామాజిక తోడు కోసం కుటుంబ వ్యవస్థ ఏర్పడింది.

సమాజం అంటేనే మనం మనం మనం మనం మనం తో ఎలా ఉండాలో ఎవరితో ఎలా ఉండాలో ఏ విధంగా ఉండాలో మానవులం తెలుసుకొని మసులుకోవాలి ఎలాగంటే.
సాధు సజ్జనుల సాంగత్యం జ్ఞానానికి వెలుగన్న అనే సంగీతనలో లోకనీతి కనపడుతుంది జ్ఞానం కలిగిన వాళ్ళు మంచి వాళ్ళతో స్నేహం చేయాలి మంచిని ఆచరించి సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని పొందాలి స్త్రీ జాతిని కామ వాంఛతో కాకుండా కుటుంబంతోని తోబుట్టుగా చూసినప్పుడే రామరాజ్యం ఏర్పడగలదు ఈ సృష్టిలో ప్రయత్నంతో శివతత్వాన్ని అవగతం చేసుకోగలిగితే చాలు మోక్షం ప్రాప్తిస్తుంది అలాగే భాగవతం భగవద్గీతలను అనుసరించి ఆచరణ చేయగలిగితే ఉత్తమ సమాజం అవతరిస్తుంది.

మనకంటూ ఉన్నతమైన సమాజాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం సంఘటితంగా బతుకుతున్నాం అయితే మనం సమాజంలో ఎలా ఉండాలి అసలు మన కర్తవ్యం ఏమిటో తెలుసుండాలి ఎలాగంటారా!

ఎవరి కర్మ ఎట్లుగలదో ఏమీ తెలియదు రా కర్మ ఎట్లుగలదో రాక తీరదు ధనవంతుడు ఈనాడు ధన రాశి ద్రైరి కోటికి కరువైనవాడు కోటికి పరిగెత్తేసిరి హరిచంద్రుడు ఒకనాడు అహంకార రాజయ్యండి అష్టకష్టములను బడి ఆలినమ్మి కొలువుండి పాండవులు రాజులయ్యి పరిపాలన కరువై పరరాజు దొరికిపోయి పని మనుషులు అయిపోయి రాముడు బడే కష్టములు స్వర్ణసీత యాగములు సీతా బడును అతి శ్రమలు రావణ చావు భ్రమలు అనుకునేది ఒకటి అయ్యేది మరి ఒకటి అదే కర్మఫలం ఒకటి అందరి ముందు ఒకటి కష్ట సుఖ మూలను గౌడు కార్యకర్త మానవుడు.

సంకీర్తనలు వినసొంపుగా ఉండటానికి ఆదిమధ్య అంత్యప్రాసలను సంకీర్తనచార్యులు ఆడడం సహజం అయితే మెరుగు రామయ్య అంతే ప్రాసలను వాడాడు వారు పాడిన ప్రతి సంకీర్తనలు అంత్యక్స మనకు కనిపిస్తుంది కానీ కొన్ని సంకీర్తనాల్లో ఆధ్యాక్షర ప్రాస కూడా ఉంది తప్పు చేయని వారు ఎవరు తప్పుచేసి మరిచిన వారే గలరు అందరి కోరేరు తలకుటి అందితే మురిచేరు చిలకా పలుకవే నీ పలుకులు చిలక పలుకవి నీ పలుకులు నీ పలుకులు అమృతపు మొలుకు మీ పలుకు బ్రహ్మ ని పలుకు జీవితానికి మూలాధారం జీవిత దేహం మోక్షానుసారం అనే సంకీర్తనలు అంతే ప్రాస వాడారు మెరుగు రామయ్య సంకీర్తనల్లో అనేకమైన పదాలు అద్భుతంగా వాడారు తీపి ముచ్చట్లు చీకటి లోపం సాధు సజ్జనులు ఒంటివారు జ్ఞాన జ్యోతి నిజ నడుక అతిప్రియమో వెర్రి భ్రమలు మోక్షంలో మోక్షం సూక్ష్మంలో మోక్షం తత్వచింతన అనే పదాలను వాడడం జరిగింది.

సంకీర్తనలు వినడానికి పాడుకోవడానికి సులువుగా సరళ పదాలతో కూడుకొని ఉన్నాయి సహజంగా ప్రాసలను సంగీతనాచార్యులు వాడుతారు. మెరుగు రామయ్య కూడా సుమారు 150 సంకీర్తనలు అంతే ప్రస వాడారు తాను సుఖముగా బ్రతికే కోసం తాను దేశ ఇతరుల మోసం అంటే మనం సహజంగా తప్పులు చేస్తాం కానీ మన తప్పులను సరిదిద్దుకొనగలిగే వారే నిజమైన మనుషులు అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుత కాలంలో తప్పులు వలబోకుగా చేస్తూ చేసిన తప్పులు మర్చిపోతున్నారు అలా మర్చిపోకుండా జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించగలవాడే మనిషి.

వ్యాసం
డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
తెలుగు అధ్యాపకులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్
9849808757

Comments (0)
Add Comment