కంప్యూటర్ సైన్స్ లో నెట్ సాధించిన రెవెళ్ల దిలీప్ కుమార్

నెట్ సాధించిన రెవెళ్ల దిలీప్ కుమార్

యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నెట్ ) లో కంప్యూటర్సైన్స్ శాస్త్ర విభాగం లో ఉత్తీర్ణత సాధించిన ఘనత రెవెళ్ల దిలీప్ కుమార్ కు సొంతమైయ్యింది. ఇతను నిర్మల్ పట్టణం బుధవార్ పేట్ కు చెందిన ఆర్టీసీ కండక్టర్ రేవెళ్ల గంగాధర్ కుమారుడు. ఈయన ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో కంప్యూటర్ సైన్స్ విభాగం లో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా జే . భీమారావ్ మరియు ప్రముఖ నిర్మల్ కవి డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ మరియు కొంతం మురళీధర్, త్రిపాటి వెంకట్ రెడ్డి, నరేందర్, రవీందర్, గుల్నాజ్, సన,నుశ్రత్, సాదియా, మూన్నావర్ అలాగే అధ్యాపకులు, సిబ్బంది అందరూ అభినందనలు తెలియజేసారు.