అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు కోసం ఉపముఖ్యంత్రి బట్టి విక్రమార్క ను కలిసిన నిర్మల్ సంఘం నాయకులు

హైదరాబాద్ న్యూస్

*అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఏర్పాటు చేయాలి*. *. ఉపముఖ్యంత్రి బట్టి విక్రమార్క నీ కలిసిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు* ఈరోజు నిర్మల్ జిల్లా వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారిని కలిసి నిర్మల్ జిల్లా పట్టణ కేంద్రంలోని దివ్య నగర్ అయ్యప్ప గుడి ముందరి భాగంలో గల 534 సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆ ప్రభుత్వ స్థలంలో జిల్లాలోని నిరుద్యోగులు అందరికీ ఉపయోగపడే విధంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది, వెంటనే స్పందించిన వారు తొందరలోనే ఆ సర్వే నంబర్ లో గల భూమిని సర్వే చేయించి అంబేద్కర్ స్టడీ సర్కిల్ కి కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు,
మొన్న మంత్రి సీతక్క ఈ రోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు వినతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంతం గణేష్, ఉపాధ్యక్షుడు దామ భూమేష్, పట్టణ అధ్యక్షుడు కత్తి నవీన్, రవి, అరుణ్ , శ్రీనివాస్, బోర శ్రీధర్ తదితర నాయకులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.