మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారం పై కొరడా జూలిపిచ్చిన నిర్మల్ పోలీసులు

ఆన్లైన్ కాయిన్ వ్యాపారం పై కొరడా జూలిపిచ్చిన నిర్మల్ పోలీసులు

*క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టిస్తూ ప్రజలను మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన… నిర్మల్ జిల్లా పోలీసులు*

*చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ఐపిఎస్ గారు*

ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రజలను ఏదో ఆశ చూపించి మోసాలు చేస్తున్నారు కస్టపడ కుండాడబ్బులు సంపాదించాలని దురాశ తో కొంత మంది కలసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళని, వ్యాపారాలు చేసే వాళ్ళని వారితో పాటు మద్య తరగతి వారిని ఏదో ఆశ చూపి బురిడి కొట్టించి వారందరినీ ఆన్లైన్ కాయిన్ వ్యాపారం గురించి తెలియపరచి వారితో డబ్బులు కట్టిస్తున్నారు. జిల్లా లో కడెం నుండి ప్రారంబించి ఇలా అన్ని జిల్లాల ప్రాంతాల ప్రజలను మోసాలు చేయడమే వీరి పని. కొన్ని రోజుల తర్వాత ఈ స్క్రిప్ట్ కాయిన్ మోసపూరితమని తెలవడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ లో బాగంగా ఇట్టి విషయాని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ఐపీఏస్ గారు తెలుసుకుని అవినాష్ కుమార్ ఐపీస్ గారికి నేతృత్వం లో ప్రత్యేక టీం ఏర్పాటు చేసినారు. అయితే మీరు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వారిని పట్టుకోవడం జరిగిందని మొదట గా 1) Salla Rajkumar r/o Nawabulpet of Kadam madal, ని విచారించగ మొత్తం నేరం ఒప్పుకుని అన్నీ వివరించారు తరువాత 2) Sai Kiran, 3) Kandela Naresh, occ: SGT Teacher, Gangapur of kadam mandal r/o Priyadarshininagar of Nirmal, 4) Gangadhar, occ: Excise SI and 5) Mahesh occ: AR Police Constable తీసుకు వచ్చి విచారణ మొదలు పెట్టారు. సల్లా రాజ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం .. Unit Coin/ U-bit Coin అనే ఆన్లైన్ వ్యాపారం లో పెట్టుబడి పెట్టండి మీకు డాలర్ ల రూపంలో మీకు వస్తాయి లేకుంటే మాది పూచీకత్తు అంటూ మరియు 500 రోజులలో (ఏడాదిన్నర) 5 నుండి 10 రెట్లు పెంచుకునే అవకాశం ! కనీస కొనుగోలు :- 50$ (5,000/-). గరిష్ట కొనుగోలు :- 10,000$ (10 లక్షలు). నాన్ వర్కింగ్ ఇన్ కం :- స్టేకింగ్ బోనస్ రోజుకు 0.5% అంటే నెలకు 15% (500 రోజులు). వర్కింగ్ ఇన్ కం :- రిఫరల్ బోనస్ 1% – 100%. లెవెల్ బోనస్ 1 – 50 లెవెల్స్. లీడర్ షిప్ బోనస్ :- 1* – 7* 10 CR. ఇది కంపెనీ కాదు. ఉద్యోగం కాదు. వ్యాపారం కాదు. పెట్టుబడి కాదు.
మీరు ఎంత మంది ని జాయిన్ చెపిస్తే మీకు అంతా లాభాలు వస్తుందని పెద్ద పెద్ద ఆశలు చూపించి వారందరిని మభ్యపెట్టి పెట్టి ఇట్టి వ్యాపారంలో చాలా మంది ఉద్యోగస్తుల్ని చిన్న, మధ్య తరగతి వారిచే పెట్టుబడి పెట్టించి నెలకి కొంత సొమ్ము వారికి చెల్లిస్తూ విస్తరించారు. ఇట్టి వ్యాపారానికి ఎటువంటి గుర్తింపు లేదు. బాధితుల పై ఈ పథకం ప్రభావం తీవ్రంగా ఉంది. అమాయకుల నుంచి వసూలు చేసిన సొమ్ము దుర్వినియోగం అవుతోంది, అక్రమార్కులు చేసిన తప్పుడు వాగ్దానాలను నమ్మి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ వ్యాపారం వెబపోర్టల్ పనిచేయక పోతే ముందుగా జాయిన్ అయిన వారు లభ్యపడతారని కానీ ఎక్కువ శాతం కొత్తగా పెట్టుబడి పెట్టిన వారు నష్టపోతున్నారు. ముందుగా జాయిన్ అయిన వారికి మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా ఈ వ్యాపారం రూపొందించబడింది.
వీరు మొదటగా ఒకరిని జాయిన్ చేపించిన తర్వాత ఇంకొకరితో ఒత్తిడి తీసుక వస్తారు. మళ్లీ కొత్త వారిని జాయిన్ చేపిస్తారు. వీళ్లను సళ్ళ రాజ్ కుమార్ Metamask లో ఖాతాను సృష్టించి, మరియు ఆ తర్వాత Ubit క్రిప్టోలో ఖాతాను తెరిచాడు. ప్రారంభ పెట్టుబడి 500 రోజుల వరకు లాక్ చేయబడిందని, ఆ తర్వాత పెట్టుబడి పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని చెబుతాడు. అయితే, అతను కనీసం $3,000 (సుమారు ₹2,52,000) పెట్టుబడితో ఐదుగురి ని చేర్చినట్లయితే, అతను నిర్ణీత కమీషన్ రేటుతో రోజువారీ ఆదాయాన్ని పొందడం పొందుతారు. ఇదే కాక ఇంకొక బిజినెస్ లో కొత్త చెరికలు గొలుసు కట్టు లో గొలుసు పెరిగేకొద్దీ, కమీషన్ కూడా పెరుగుతుంది, పెట్టుబడి పెట్టిన డబ్బు విలువ మూడు రెట్లు పెరుగుతుందని వాగ్దానం చేస్తారు. లాభదాయకమైన ఒప్పందాలను అందించడం మరియు తప్పుడు వాగ్దానాలు చేయడం

ద్వారా ఒక వ్యక్తిని స్కీమ్‌లో చేర్చవచ్చని సళ్ళ రాక కుమార్ వాళ్లని నమ్మిస్తాడు. నిర్మల్ జిల్లాలో Ubit అనే కరెన్సీ నెట్వర్క్ తో పాటు ఇతర వ్యక్తులను ఈ పథకానికి జాయిన్ చేస్తున్నట్లు తెలిపాడు. దీనికంతా ఇతను బాధ్యత వహించినట్లు విచారణ లో అంగీకరించాడు. ఇతను సి కిరణ్ ని గుర్తించి Ubit network ను విస్తరించడంలో సాయికృష్ణ తో పాటు నరేష్, మహేష్, మరియు గంగాధర్ కీలకంగా ఉన్నారు, వీరందరూ ఒకరి తరువాత ఒకరు వ్యాపార లో చేరారు, తప్పుడు వాగ్దానాలతో వ్యక్తులను చేర్పించారు మరియు వారి డబ్బును ఎలా మోసం చేసారు అనే వివరాలను వివరించారు. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 0.5% అంటే 500 రూపాయలు ఇస్తానని చెప్పి అమాయక ప్రజలను నమ్మించి Ubit Cryptoలో పెట్టుబడి పెట్టమని నమ్మించి సళ్ళ రాజ్ కుమార్ మరియు మహేష్, గంగాధర్‌తో కలిసి గతంలో స్కూల్‌మేట్ అయిన సాయి కృష్ణ తో కుట్ర పన్నారని ఇతను ఒప్పుకున్నాడు.

డబ్బు సంపాదించడం కోసం మరికొంతమంది అమాయక వ్యక్తులతో whatsapp గ్రూప్‌ని సృష్టించారు. ఈ సమాచారాన్ని గ్రూప్ లో చెరవేస్తూ అందరినీ ఆశ చూపిస్తూ చాలా పెద్ద ఎత్తున ప్రజలందరిని మోసం చేసి జాయిన్ చేపిస్తారు. ఇప్పటికైనా జిల్లా వాసులు ఇలాంటి మోసపూరితమైన బిజినెస్లకు మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇలాంటి ఆన్లైన్ బిజినెస్లకు పెట్టుకోవద్దని, మీ కుటుంబాలను రోడ్డల పాలు చేసుకోవద్దని, ఇలాంటివారు మళ్లీ ఎవరైనా వస్తే మాకు సమాచారం తెలపండి అని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు..

ఇట్టి కేసుని విచారించిటంలో చక్కటి ప్రతిభ చూపించినటువంటి అవినాష్ కుమార్ ఐపీఎస్ ఏఎస్పీ గారిని మరియు డిఎస్పి గంగారెడ్డి నిర్మల్ వారితోపాటు నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ , ఎస్సైలు సాయి కృష్ణ, ఎం రవి, రవీందర్ మరియు కానిస్టేబుల్ తిరుపతి , గణేష్, శోకత్, సతీష్ లను ఎస్పీ గారు ప్రశంసించారు

Get real time updates directly on you device, subscribe now.