నిర్మల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ అధ్యాపకులు గుండంపల్లిలో శనివారం కరపత్రాలు పంపిణీ చేశారని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ కళాశాలలో ఉత్తమ అధ్యాపకులు వున్నారని, జ్ఞాన సముపార్జనకు తగిన తరగతి గదులు, ఆటస్థలం, బొటానికల్ గార్డెన్, ల్యాబ్స్, గ్రంథాలయం, హాస్టల్ వసతి కూడా కలదని త్రిపాఠ్ వేంకట్ రెడ్డి, డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ అధ్యాపకులు విద్యార్థులకు వివరించారు.