సమదర్శిని న్యూస్, ఉట్నూర్
ఆదివాసి గూడాల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క అన్నారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతూ నార్నూర్ మండలం ధనుగూడ గ్రామస్తులు ఉట్నూర్ లోని క్యాంపు కార్యాలయంలో సుగుణక్కను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన సుగుణక్క త్వరలోనే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ధనసరి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి చిత్తగూడ నుంచి ధనుగూడ వరకు రహదారి నిర్మాణంతో పాటు మధ్యలో వున్న వాగుపై వంతెన నిర్మాణం, గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. వర్షాకాలం నేపత్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున గ్రామస్తులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నివాస పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు.
*ఆత్రం సుగుణక్క క్యాంపు కార్యాలయం, ఉట్నూర్*