నకిలీ ధృవపత్రాన్ని సృష్టించిన వారిపై కేసు నమోదు

*నకిలీ ధృవపత్రాన్ని సృష్టించడమే గాక, దానిని ఉపయోగించి భూమిని ఆక్రమించినందుకుగాను మాజి కొత్తపల్లి ఎమ్మార్వో చిల్ల శ్రీనివాస్ (ప్రస్తుత గజ్వెల్ ఎమ్మార్వో), అతని బినామీ మరియు సహకరించినవారిపై కరీంనగర్ సీతారాంపూరుకు చెందిన బొంతల రఘు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నందు12 మందిపై కేసు నమోదుకాగా వారిలో ముగ్గురుని అదుపులోకి తీసుకోగా 9 మంది పరార్ లో ఉన్నారు.*

*అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించిన ముగ్గురిలో మాజీ కొత్తపల్లి ఎంఆర్ఓ A1)చిల్ల శ్రీనివాస్ (మాజీ కొత్తపల్లి ఎమ్మార్వో ప్రస్తుత గజ్వెల్ ఎమ్మార్వో ) అతని బినామీ A2) చంద సంతోష్ గోదావరిఖని కళ్యాణ్ నగర్, A10)పల్లె జీవన్ అప్పటి కొత్తపల్లి ఎమ్మార్వో ఆఫీసులో వి.ఆర్.ఏ ప్రస్తుత తూంకుంట మున్సిపల్ ఆఫీస్ నందు జూనియర్ అసిస్టెంట్.*
12 మంది నిందితుల పైన కేసు నమోదు
A1)చిల్ల శ్రీనివాస్
A2)చంద సంతోష్
A3) పల్లె జీవన్
A4)బొంతల రవి
A5)బొంతల లావణ్య
A6)ఉప్పుల కనక లక్ష్మి
A7)దాడి రాధా
A8)చెప్ప మంజుల
A9)చిలువేరు స్వప్న
A10)చిలువేరు మల్లేశం
A11)పల్లె జీవన్
A12)బుచ్చిరాజు లపై పలు సెక్షన్ల 467,468,471,409,420,120-బి r/w 34 IPC కింద కేసు నమోదు

Get real time updates directly on you device, subscribe now.