బదిలి పై వచ్చిన లెక్చరర్ రాథోడ్ శ్రావణ్ కు ఘనంగా సన్మానం

సమదర్శిని న్యూస్ : 10.09.2024
ఆదిలాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంద్రవెల్లి నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల గుడిహత్నూర్ కు బదిలి పై వచ్చిన హిందీ అధ్యాపకుడు రాథోడ్ శ్రావణ్ ను కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. కళాశాల ప్రిన్సిపల్, జిల్లా మాధ్యమిక విద్యాధికారి సి.రవీందర్ కుమార్ మాట్లాడుతు ఉద్యోగి అనప్పుడు బదిలి సహజమని అన్నారు. అంకిత భావంతో పని చేస్తేనే మంచి గుర్తింపు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యా పకులు,బోధనేతర సిబ్బంది ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.