దీక్షభూమి కొత్తపల్లిలో 45,వ. గురు కృప దినోత్సవం…రచయిత రాథోడ్ శ్రావణ్*

*దీక్షభూమి కొత్తపల్లిలో 45,వ. గురు కృప దినోత్సవం…రచయిత రాథోడ్ శ్రావణ్*

సోమా భంగీ, కేశా జంగీ, భంగీ దేగావత్ భూక్యారో అవతారి,
వన్నిసో బ్యానవేమ దీక్ష్యారి కిదో తయారి,
తోన మారుచు తుకారి తూ జగదాంబారో పూజారి.రాజయోగి తపస్వి రామరాయరో తూఛి బాపు శిష్యధారి.
కొత్తపల్లిమ జన్నలిదో బంజారా సమాజేన్ ఏకి కిదో
తాండే తాండేమ జండా ఝూలాయో సేవా భాయారో తూ భోగ్ లగాయో
శంకర్ లోద్ధి మ తపమాండో జ్ఞానబ్రహ్మచారి
ఘమా లచ్మా భంగిరో తూఛి బాపు పుత్రధారి.

దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ కీ జై !! జై సేవా లాల్ జై జై సేవా లాల్ !2!!

దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని దీక్ష భూమి కొత్తపల్లి (హెచ్) బంజారాల అత్యంత ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటి. దీక్షభూమి పీఠాధిపతి అయిన సంత్ దీక్షగురు శ్రీ శ్రీ శ్రీ ప్రేమ్ సింగ్ మహారాజ్ జగత్ జనని జగదాంబ దేవి భక్తుడు.

ఇతని గురువు నిర్గుణ నిరంకారి బాల బ్రహ్మచారి,రాజయోగి, రాష్ట్రీయ సంత్, మహాన్ తపస్వి శ్రీ శ్రీ శ్రీ, డాక్టర్. రామారావు మహారాజ్.

1978 లో ప్రేమ్ సింగ్ మహారాజ్ శంకర్ లోద్ధి అనే స్థలంలో దీక్షకు పునుకున్నారు.1979లో ఒక అద్భుతమైన ఘటన జరగడం విశేషం శ్రీ ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు శంకర్ లొద్ది అనే పవిత్ర మైన స్థలంలో ఒక సంవత్సరం కాలం పాటు భగవాన్ శంకరుని అనుగ్రహముతో తపస్సు చేసెను. శంకర్ లొద్దిలో శివపురాణం ఆధారంతో భక్తి మార్గంలో నిమగ్నమైన మహారాజ్, గురువు సంత్ రామారావు మహారాజ్, జగదాంబ దేవి పేరుతో ధూపదీపం పెట్టి అన్నపానీయాలు విడిచి రావి చెట్టు నీడలో దట్టమైన అరణ్యంలో నది ఒడ్డున సంవత్సరం కాలం పాటు ఆధ్యాత్మికంగా తపస్సు చేసి దైవ సౌక్షాత్కారాన్ని పొందినారు. మాత జగదాంబ దేవి, రాజగురువు, శ్రీ రామారావు మహారాజ్ గారి కలలో ప్రత్యక్షమై ప్రేమ్ సింగ్ మహారాజ్ గురించి చెప్పడంతో 11జనవరి1979లో పౌరాఘడ్ పీఠాధిపతి అయిన సంత్ శ్రీ రామారావు మహారాజ్ మహారాష్ట్ర లోని వాసీం జిల్లా పౌరాదేవి ఆలయం నుండి తెలంగాణా రాష్ట్రం లోని ఆసిఫాబాద్ జిల్లా కెరామెరి మండలంలోని అనార్ పల్లి మీదుగా భక్తులతో శంకర్ లొద్ది చేరుకొని ప్రేంసింగ్ మహారాజ్ గారిని కలిసి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని తపస్సు నుంచి నిష్క్రమించాలని చెప్పడంతో,
ఆ అంతర్యమీ తపస్సు ద్వారా శ్రీ,రామారావు మహారాజ్ ఆజ్ఞతో వరాలను పొందినారు.తపస్సు,మరియు ఆజ్ఞ వలన మహారాజ్ కు దివ్యమైన తేజస్సు ఉత్పన్నమైందని భక్తులు అంటారు.అప్పటి నుండి జనవరి 11న ప్రతి సంవత్సరం గురుకృప దినోత్సవం
(గురుమిలన్ దివస్) దీక్షభూమి కొత్తపల్లి (హెచ్) లో భక్తులు అంగరంగవైభవంగా జరుపుకుంటారు. వేలాది మంది భక్తజన సందోహం మధ్య
అంగరంగా వైభవంగా మూడు రోజులు పాటు దీక్షభూమి యందు జాతర నిర్వహిస్తారు.
ఈ గురుకృప దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని వివిధ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్, కర్ణాటక,రాజస్థాన్,ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, మరియు తెలంగాణ మొదలగు రాష్ట్రల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కు తీర్చుకొని మహారాజ్ ఆశీర్వాదం తీసుకుంటారు.
గురుకృప దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నార్నూర్ మండలంలోని గంగాపూర్ తాండా భక్తులు సేవాలాల్ దీక్షభూమి వరకు భజనలు చేస్తు బాజా బజంత్రీలతో పల్లకి మోస్తూ పాదయాత్రతో దీక్ష భూమి
కొత్తపల్లిని చేరుకుంటారు.ఇచట కొలువుదీరిన గోర్ బంజారాల కులదైవాలైన మాతా జగదాంబాదేవి,రాజయోగి, నిర్గుణ నిరంకారి బాలబ్రహ్మ రాష్ట్రీయ సంత్ మహాన్ తపస్వి డా.రామరావు మహారాజ్ కు పూజలు చేసి భోగ్ బండారో కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.
ఇది పౌరాదేవి తర్వాత బంజారా భక్తులకు అత్యంత పవిత్రమైన భూమిగా చెప్పవచ్చు.

41 రోజులు పాటు సేవాలాల్ దీక్షలు:-
సేవాలాల్ దీక్షలు శ్రీ సంత్ దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ మొట్టమొదటి సారిగా 1992‌లో ప్రారంభించారు. దీక్షభూమి కొత్తపల్లి నుండి పౌరాఘడ్ కు “సేవాదళ్ ” పేరుతో సుమారు యాభైవేల పైగా భక్తులను కాలినడకన గురు శ్రీ ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు పౌరాదేవికి తీసుకొని వెళ్ళటం గొప్ప విషయం.అప్పటి నుండి ప్రతి సంవత్సరం భక్తులు దీక్ష భూమిలో దీక్ష తీసుకొని పౌరాదేవి వెళ్తుతుంటారు.

మహాశివరాత్రి పర్వదినాన మొదలు శ్రీరామ నవమి వరకు ఎటు చూసినా సేవాలాల్ దీక్షలు వీనులవిందు చేసే జై సేవాలాల్ నామస్మరణలు చల్లటి నీటితో చన్నీటి స్నానం, నేలమీద శయనం, నిరాడంబర జీవనం గులాబీ వస్త్రాలతో శాంతస్వరూపంతో సేవాలాల్ భక్తులు…
*”మహాశివరాత్రి పర్వదినాన మొదలుకోని శ్రీ రామనవమి వరకు ఎటు చూసినా సేవాలాల్ దీక్షలు వీనులవిందు చేసే జై సేవాలాల్ నామస్మరణలు చల్లటి నీటితో చన్నీటి స్నానం, నేలమీద శయనం నిరాడంబర జీవనం గులాబీ వస్త్రాలతో శాంతస్వరూపంతో సేవాలాల్ భక్తులు…”.*

బంజారాల కాశీ మహారాష్ట్రలోని పౌరాఘడ్ లో కొలువైవున్న బంజారాల ఆరాధ్యదైవం శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి మరియు ఇతర దేశాల నుంచి గోర్ బంజారా భక్తులు తరలి వెళ్తారు. భక్తులు స్త్రీ, పురుషులు 41రోజులు దీక్ష ప్రారంభించేటప్పుడు తెల్లని ధోవతిలు, లుంగీలు, ప్యాంటులు తొడిగి గులాబీ రంగు చొక్కలు,కమీజులు ధరించి నియమ నిష్ఠలతో నలభై ఒక్క రోజులు కఠిన దీక్షకు పూనుకుంటారు. చన్నీటిస్నానం పాదరక్షలు వదిలేయడం, ఏకభుక్తం, బ్రహ్మచర్యం లాంటి నియమాలతో ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది. తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయటంవలన మనోచైతన్యం కలుగుతుంది. మంచి మార్గానికి మళ్లించే జీవనం మొదలై ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతాయి. చెడు వ్యసనాలకు దూరమై రెండు పూటలా స్నానం చేసి దుస్తులు మార్చడం ద్వారా పరిశుభ్రత అలవడుతుంది. సాముహికంగా పూజలు భక్తి శ్రద్ధలతో భజన, కీర్తనలు చేసి హారతిలు ఉదయం,సాయంత్రం ఈ విధంగా చేయడం జరుగుతుంది.
*సద్గురు హమారో పామణో రెయెవాళో..!! అజెరో దాడో సోనె సరికో మళో..!! కరతాణీ వాసనా శుద్ద మనేరి..!!,ఓవాళు అరతి గురు ప్రేమ్ సింగేరి..!!*
అని పాడుతారు. సేవాలాల్ దీక్ష సమయంలో భక్తులు మాదకద్రవ్యాలు సేవించడం గాని అబద్ధాలు మాట్లాడడం గాని, అపకారాలు తలపెట్టే విధంగా కుట్రలు పన్నడం, దూషించడం, చెడు ఆలోచనలు పెట్టుకోవడం గాని ‌చేయరు.భక్తులు స్వయంగా తయారు చేసిన వంటకాలు మాత్రమే భుజిస్తారు. అంటు ముట్టు ఐనా పానియాలు సేవించరు. ఈ కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినాన మొదలుకోని శ్రీ రామనవమి వరకు కొనసాగుతుంది.భక్తులు పౌరాదేవికి వేళ్ళి శ్రీరామ నవమి రోజున మాతకు భక్తులు కానుకలు సమర్పించి మొక్కుచెల్లించి సేవాలాల్ దీక్షలు విరమిస్తారు. ఈ విధంగా మహారాజ్ ప్రజలు జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం గమనార్హం.
*దీక్ష వెనుక దాగి ఉన్న శాస్త్రీయత…*
ఏడాదికి సుమారుగా 360 రోజులు దానిని తొమ్మిదితో భాగించగా వచ్చేది నలభై ఆ నలభై రోజులు కఠిన నియమాలను అవలంభిస్తే, అది మిగిలిన జీవితానికి ఆదర్శ వంతంగా నిలుస్తుంది. నియంత్రణ, విగ్రహాలు అలవడతాయి. నిరాడంబర జీవితం ప్రారంభమవుతుంది. సకల జీవుల్లో దేవుడున్నాడనే భావనతో ఆధ్యాత్మిక చింతనే శాశ్వతమన్న నమ్మకంతో…. భక్తులు అందరిలో దైవాన్నే చూస్తారు.ఆధ్యాత్మికతను పెంచి ఆరోగ్యాన్ని సంరక్షించే నియమాలను అవలంభించాక, ఇంకా ఆ సద్భావనలను జీవన పర్యంతం ఆచరించాలన్నదే

“శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ దీక్ష గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు స్వర్గీయ శ్రీ/శ్రీమతి ఘమాబాయి లచ్మాభంగీ దంపతులకు 1944 లో జన్మించారు.”
దేశంలోని వివిధ రాష్ట్రాల తాండాల్లో ప్రయాణిస్తు ప్రజలను చైతన్యవంతులు చేసి
సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవి ఆలయం భూమిపూజ, మందిర నిర్మాణానికి కృషి చేస్తున్నారు. విగ్రహ ప్రతిష్టాపన,భోగ్ భండారో కార్యక్రమాన్ని నిర్వహిస్తు,తన యొక్క మధురవాణితో ప్రజలను చైతన్య పరుస్తు మత మార్పిడులను నిరోధిస్తున్నారు. హిందు ధర్మాన్ని మరియు బంజారా సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతు
హైందవ సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటుతున్నారు.

రచయిత:- రాథోడ్ శ్రావణ్
సోనాపూర్ నార్నూర్ ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ 504311
చరవాణి సంఖ్య 9491467715.

Get real time updates directly on you device, subscribe now.