ప్రజ్ఞాన్ విద్యార్థి పజ్ఞ

*ప్రజ్ఞాన్ విద్యార్థి పజ్ఞ*

ప్రజ్ఞవికాస్ వారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అన్ని పాఠశాలల్లో వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఈపోటీలలో రాష్ట్రం లోని అన్ని పాఠశాలలలో దాదాపు 6000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఇందులో మేడ్చల్ జిల్లా ఉప్పల్ లోని ప్రజ్ఞాన్ ది స్కూల్ లో 10వ,తరగతి చదువుతున్న చిరంజీవి వలిపే రామ్ చేతన్ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందడం జరిగింది. ముచ్చింతల లోని స్వామి వారి ఆశ్రమంలో జిల్లాస్థాయిలో గెలుపొందిన వారికందరికీ మళ్ళీ రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీ శనివారం నాడు నిర్వహించారు. దాదాపు 500 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో కూడా చిరంజీవి వలిపే రామ్ చేతన్ ద్వితీయ బహుమతి గెలుపొందారు. విజేతగా నిలిచిన చిరంజీవి వలిపే రామ్ చేతన్ ను శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గారు ప్రశంసాపత్రంతో సత్కరించి చిరంజీవిని ఆశీర్వదించారు.ఈకార్యక్రమంలో చిరంజీవి తల్లిదండ్రులైన శ్రీమతి వలిపే సత్యనీలిమ, శ్రీ వలిపే లక్ష్మీ నరసింహ రావు గార్లు కూడా పాల్గొన్నారు.పాఠశాల యొక్క పేరును రాష్ట్రస్థాయిలో నిలబెట్టిన చిరంజీవి రామ్ చేతన్ ను పాఠశాల యాజమాన్యం అరుణ్ సూర్య, శకుంతల, నళిని గార్లు మరియు ఇతర ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్.రంజిత్ కుమార్ తదితరులు అభినందనలు తెలియ జేసారు.

Get real time updates directly on you device, subscribe now.