తానా అంతర్జాతీయ గేయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవి చిలుకమారి తిరుపతి

తానా అంతర్జాతీయ గేయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవి చిలుకమారి తిరుపతి

“తానా అంతర్జాతీయ గేయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవి చిలుకమారి తిరుపతి

ఉత్తర  అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై  ప్రతిష్ఠాత్మకంగా “అంతర్జాతీయ గేయ కవితల పోటీలు” నిర్వహించింది. 

ఈ పోటీలో మంచిర్యాల జిల్లాకు చెందిన కవి చిలకమారి తిరుపతి గారు ఎంపికయ్యారు. మే 27, 28, 29 తేదీలలో జరుగుతున్న కార్యక్రమంలో 28వతేదీ జూమ్ లో    తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి వేదిక మీద  తిరుపతి చిలుకమారి తమ గేయాన్ని పాడి వినిపించ బోతున్నారు.

మాతృభాష అనే అంశంపై భాష గొప్పతనాన్ని వర్ణిస్తూవున్నా గేయం, తను రాసిన ఈస్వీయ గేయం ఎంతో హృంద్యంగా,భావయుక్తంగా ఉండటంతో ఈ పోటీలో  ఎంపికయింది.

ఇంతటి విశేషమైన కార్యక్రమంలో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్నందుకు 
తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు గారికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. 

అనేకమంది దేశ, విదేశ తెలుగు కవులు, ప్రముఖులు హాజరయ్యే 

ఈ “తానా గేయ తరంగాలు ” కార్యక్రమం తానా అధికారిక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. “యప్ టీవీ” ద్వారా అమెరికాతో  పాటు, యూరప్ దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. 

ఈటీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు మరియు ఇతర మాద్యమాలలో ప్రసారం కానుంది. 

సరళమైన భాషలో, సామాజిక స్పృహ కోసం రచనలు చేసే చిలుకమారి తిరుపతి గారు అంతకుముందు మార్కండేయ చరిత్ర పద్య కావ్యాన్ని ప్రచురించారు. వృత్తి రీత్యా వీరు ప్రైవేటు ఉపాధ్యాయులు. జిల్లా  స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డులు మరియు జాతీయ స్థాయి ప్రవీణం సరస్వతీ పుత్రులు బిరుదును పొందారు. ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నారు. 

ఈరోజు చెన్నూరు పట్టణ ఖ్యాతిని  ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన చిలుకమారి తిరుపతి గారిని నగర పెద్దలు, ప్రముఖులు, సాహితీవేత్తలు  ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.