సరస్వతీ పుత్రులు పురస్కారానికి ఎంపిక అయిన శ్రీనివాస్

విజయనగరం జిల్లా కు చెందిన యడ్ల శ్రీనివాసు రావు గారు అరుదైన సరస్వతీ పుత్రులు పురస్కారానికి శుక్రవారం రోజు ఎంపిక కాబడ్డారు. ఆయన ఆధునిక సాహితీ ప్రక్రియ అయిన అలలు వెయ్యి రాసినందుకు గాను ఈ పురస్కారమును కైవసం చేసుకున్నారని నిర్మల్ కు చెందిన “సమదర్శిని సాహిత్య సంస్థ” అధ్యక్షులు డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో ఈ రోజు పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం సాహిత్యం పోటీలలో జరుగుతాయి. ఈ సంవత్సరము 2024 ఈ పురస్కారానికి శ్రీనివాస్ ఎంపిక అయ్యారు. వారికి జ్ఞాపిక శాలువ ప్రశంసా పత్రం అందజేస్తారు.

Get real time updates directly on you device, subscribe now.